స్మార్ట్‌ రేషన్‌కార్డులు జారీ.. టెండర్లకు పిలుపు

73చూసినవారు
స్మార్ట్‌ రేషన్‌కార్డులు జారీ.. టెండర్లకు పిలుపు
కొత్త రేషన్‌కార్డులను ‘స్మార్ట్‌’ కార్డుల రూపంలో ఇచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధం అవుతోంది. రాష్ట్రంలో దాదాపు 90 లక్షల కుటుంబాలకు రేషన్‌కార్డులు ఉన్నాయి. కొత్తగా దరఖాస్తు చేసుకున్నవారు లక్షల సంఖ్యలో ఉన్నారు. అందరికీ స్మార్ట్‌ రేషన్‌కార్డులు జారీ చేయనుంది. ఈ మేరకు సర్కారు టెండర్లు పిలిచింది. బిడ్ల దాఖలుకు మార్చి 25వ తేదీ వరకు గడువు ఇచ్చింది. ప్రీబిడ్‌ సమావేశాన్ని మార్చి 17న నిర్వహిస్తామని పేర్కొంది.

సంబంధిత పోస్ట్