హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం విద్యాశాఖకు సంబంధించి కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఇక నుంచి పాఠశాలలకు వచ్చే ఉపాధ్యాయులు డ్రెస్కోడ్ పాటించాలని విద్యాశాఖ మంత్రి రోహిత్ ఠాకూర్ పేర్కొన్నారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. ఉపాధ్యాయ వృత్తి అనేది సమాజంలో గౌరవప్రదమైన స్థానం కలిగి ఉందని అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి తెలిపారు. అయితే ఇది కఠినంగా అమలు చేయబోమని స్పష్టం చేశారు.