చిరుతపులి దాడిలో 7 ఏళ్ల బాలుడు మృతి

65చూసినవారు
చిరుతపులి దాడిలో 7 ఏళ్ల బాలుడు మృతి
మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లాలో చిరుత పులి దాడిలో 7 ఏళ్ల బాలుడు మృతి చెందాడు. సినాలా గ్రామానికి చెందిన భవేష్ ఠాకూర్ అనే బాలుడు శుక్రవారం బహిర్భూమికి వెళ్లాడు. ఇంటికి రాకపోవడంతో కుటుంబీకులు బాలుడి కోసం గాలించారు. అయితే శనివారం పోలీసులకు బాలుడి మృతదేహం లభ్యమైంది. వెంటనే పోస్ట్‌మార్టం నిర్వహించి.. చిరుత పులి దాడిలో మరణించినట్లు తెలిపారు. ఈ ఘటనతో బాలుడి కుటుంబంలో కన్నీటి ఛాయాలు అలముకున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్