అండర్ 19 వరల్డ్ కప్ 2024 తొలి మ్యాచ్లో
భారత్, బంగ్లా ప్లేయర్స్ కొట్టుకునేంత పని చేశారు. ఈ తొలి మ్యాచ్లో టీమిండియా కెప్టెన్ ఉదయ్ సహారన్ ఒక్కసారిగా తన సహనం కోల్పోయాడు. మైదానంలో మ్యాచ్ మధ్యలోనే బంగ్లాదేశ్ ఆటగాడు అరిఫుల్ ఇస్లాంతో ఉదయ్ సహారన్ మాటల యుద్ధానికి దిగాడు. అయితే అంపైర్ జోక్యం చేసుకోని వారిని వారించడంతో గొడవ సద్దుమణిగింది. ఉదయ్ సహారన్ సహనం కోల్పోడానికి, గొడవకు గల కారణం మాత్రం తెలియరాలేదు.