మరోమారు తెరుచుకున్న రత్న భాండాగారం

62చూసినవారు
మరోమారు తెరుచుకున్న రత్న భాండాగారం
పూరీ జగన్నాథ దేవాలయంలోని రత్న భాండాగారం ఇవాళ మరోమారు తెరిచారు. ఈ ప్రక్రియలో ఎటువంటి ఆటంకాలు ఏర్పడకుండా ఉండేందుకు ఆలయంలోకి భక్తుల ప్రవేశాన్ని నిషేధించారు. రత్న భాండాగారంలోని విలువైన ఆభరణాలను లోపలి ఛాంబర్ నుంచి తాత్కాలిక స్ట్రాంగ్ రూమ్‌నకు తరలించనున్న నేపథ్యంలో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఉదయం 9:51 గంటల నుంచి మధ్యాహ్నం 12:15 గంటల వరకు అధికారులు రత్న భాండాగారంలో ఉండనున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్