లోక్సభ ఎన్నికల సమయంలో పంజాబ్లో కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. పార్టీలో కీలక నేత తజిందర్ సింగ్ బిట్టు శనివారం రాజీనామా చేశారు. ప్రస్తుతం ఆయన హిమాచల్ ప్రదేశ్లో పార్టీ ఏఐసీసీ ఇన్ఛార్జ్గా వ్యవహరిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత ప్రియాంక గాంధీకి ఆయన సన్నిహితుడు. ఆయన బీజేపీలో చేరే అవకాశం ఉంది. అయితే బీజేపీలో చేరికపై తజిందర్ సింగ్ బిట్టు నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.