నాటకం వేస్తుండగా గుండెపోటుతో వ్యక్తి మృతి.. షాకింగ్ వీడియో

55చూసినవారు
స్టేజీపై నాటకం జరుగుతుండగా రాముడి పాత్రలో నటించిన ఓ వ్యక్తి గుండెపోటు వచ్చి మరణించాడు. ఢిల్లీలోని షహదారాలో ఈ ఘటన జరిగింది. విశ్వకర్మ నగర్‌కు చెందిన సతీష్‌ కౌశిక్‌(45) రాముడి పాత్ర వేశాడు. స్టేజీపై నటిస్తున్న సమయంలో ఒక్కసారిగా ఛాతి నొప్పి రావడంతో తెర వెనక్కి వెళ్లిపోయాడు. అక్కడ కుప్పకూలిపోవడంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్