ఐపీఎల్-2024లో కొత్త రికార్డు నమోదైంది. ఈ సీజన్లో తొలి రోజు చెన్నై వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్ను 'స్టార్'లో ఏకంగా 16.8 కోట్ల మంది చూశారు. ఇప్పటివరకు జరిగిన అన్ని సీజన్లలో తొలి రోజు మ్యాచ్ను ఇంతమంది వీక్షించటం ఇదే మొదటి సారి. ఈ మ్యాచ్ను ఏకకాలంలో 6.1 కోట్ల మంది చూశారు. రికార్డు స్థాయిలో 1,276 కోట్ల నిమిషాలు తిలకించారు. జియో సినిమా డిజిటల్లో 11.3 కోట్ల మంది మ్యాచ్ను చూశారు.