బెంగళూరు బ్రూక్ఫీల్డ్లోని ‘రామేశ్వరం కేఫ్’లో బాంబు పేలుడు ఘటనపై విచారణ జరుపుతున్న NIA నిందితుల సమాచారం ఇచ్చిన వారికి రివార్డు ప్రకటించింది. ఇద్దరు నిందితులు ఈ విధ్వంసానికి పాల్పడినట్లు భావిస్తున్న ఎన్ఐఏ.. ఒక్కొక్కరికీ రూ.10 లక్షల చొప్పున రూ.20 లక్షల రివార్డు ఇవ్వనున్నట్లు తెలిపింది. ఈమేరకు అధికారిక ‘ఎక్స్’లో పోస్టు చేసింది. వీరి గురించి ఏదైనా సమాచారం తెలిస్తే వెంటనే info.blr.nia@gov.inకు మెయిల్ చేయాలని కోరింది.