బైక్‌పై వెళ్తున్న ఫ్యామిలీని ఢీకొట్టిన ట్రక్కు.. ఈడ్చుకెళ్లింది (వీడియో)

65చూసినవారు
రాజస్థాన్‌లోని జైపూర్‌లో ఘోర ప్రమాదం జరిగింది. బైక్‌పై బిడ్డతో సహా వెళ్తున్న జంటను ఓ పికప్ ట్రక్కు ఢీకొట్టింది. నిర్మాణంలో ఉన్న కూడలి వద్ద బైక్ యు టర్న్ అవుతోంది. ఆ సమయంలో వెనుక నుంచి ట్రక్కు ఢీకొట్టింది. అతివేగంతో వచ్చిన ట్రక్కు ఢీకొనడంతో ఆ బైక్ గాల్లోకి ఎగిరి కింద పడింది. బైక్‌పై ఉన్న హన్సరాజ్, ఆయన భార్య సంతోష్ సైనీ, వారి కుమారుడు తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్