ఖమ్మం జిల్లాలో వైద్యం వికటించి మహిళ మృతి

56చూసినవారు
ఖమ్మం జిల్లాలో వైద్యం వికటించి మహిళ మృతి
తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో విషాదకరమైన ఘటన చోటుచేసుకుంది. కడుపు నొప్పితో బాధపడుతున్న సైదమ్మ అనే మహిళ చికిత్స కోసం జిల్లా కేంద్రానికి చెందిన ఓ ప్రైవేట్‌ హాస్పిటల్‌లో చేరింది. అయితే ఆపరేషన్‌ ఫెయిల్‌ అయి సైదమ్మ మృతి చెందిందని మృతురాలి కుటుంబసభ్యులు, బంధువులు ఆరోపించారు. దీంతో హాస్పిటల్ యజమాన్యం, సిబ్బందిపై తక్షణమే చర్యలు తీసుకోవాలంటూ.. ఆస్పత్రి ఎదుట ధర్నాకు దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత పోస్ట్