పెళ్లి సాకుతో పలుమార్లు అత్యాచారం చేయడం, గర్భం దాల్చిన తర్వాత బలవంతంగా అబార్షన్ చేయించుకోవడంతో ఓ యువతి ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో మృతి చెందింది. ఈ ఘటన హరియానాలోని గురుగ్రామ్ లో జరిగింది. దీంతో ప్రియుడిపై బాధితురాలి అన్నయ్య పోలీసులకు ఫిర్యాదు చేశాడు. జార్ఖండ్కు చెందిన ఓ యువతి గురుగ్రామ్ లో ఉంటూ.. ఫేస్బుక్ ద్వారా నగినా జిల్లా, కాన్స్లీకి చెందిన యువకుడితో స్నేహం పెంచుకుని పడింది. చివరకు అబార్షన్ కోసం ప్రియుడు యువతిని చిత్రహింసలకు గురిచేశాడని పోలీసులు విచారణలో తెలిపారు.