వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు టీడీపీలో చేరారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో జరిగిన ప్రజాగళం రోడ్ షోలో రఘురామకు చంద్రబాబు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా రఘురామ మాట్లాడుతూ.. చంద్రబాబు చొరవతో మళ్లీ ప్రజల ముందుకు వచ్చానని తెలిపారు. చంద్రబాబు, ప్రజల రుణం తీర్చుకుంటానని పేర్కొన్నారు. జూన్ 4న కూటమి ప్రభంజనం సృష్టిస్తుందని జోస్యం చెప్పారు.