ముత్ఖేడ్-పిపల్కోటి మధ్య ఆదిలాబాద్ మీదుగా సాగుతున్న రెండో రైల్వే లైన్ నిర్మాణ పనులను ఆదివారం డిప్యూటీ చీఫ్ ఇంజనీర్ ప్రకాష్ ప్రతాప్, సహాయ ఇంజనీర్ దినేష్ చౌదరి ఏరియల్ సర్వే పరిశీలన చేశారు. వారు సర్వే కోసం వినియోగించిన హెలికాప్టర్లో ఫ్యూయల్ అయిపోవడంతో ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఎరోడ్రం స్థలంలో కొంతసేపు ఆపి పెట్రోల్ పోయించుకున్నారు. అనంతరం ఆ మార్గంలో జరుగుతున్న పనులను పూర్తిస్థాయిలో పరిశీలించారు.