ఢిల్లీలో ఇండియా కూటమి నిర్వహించిన ర్యాలీలో కేజ్రీవాల్ భార్య సునీతా కేజ్రీవాల్ మాట్లాడుతూ..తన భర్త అరవింద్ కేజ్రీవాల్ను మన ప్రధాని నరేంద్ర మోదీ జైలులో పెట్టారని ప్రధాని నిర్ణయం సరైనదేనా అని ప్రశ్నించారు. జైలుపాలైన కేజ్రీవాల్ సీఎం పదవికి రాజీనామా చేయాలని బీజేపీ నేతలు కోరుతున్నారని అన్నారు. తన భర్త కేజ్రీవాల్ సింహం లాంటి వాడని, ఆయనను ఎంతోకాలం కాషాయ పాలకులు జైల్లో బంధించలేరని సునీతా కేజ్రీవాల్ అన్నారు.