మహాత్మా జ్యోతిరావు పూలేకు మాల సంఘం నేతల నివాళ్లు

54చూసినవారు
మహాత్మా జ్యోతిరావు పూలేకు మాల సంఘం నేతల నివాళ్లు
ఆదిలాబాద్ మాల సంక్షేమ సంఘం అడహాక్ కమిటీ ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు నిర్వహించారు. జ్యోతిరావు పూలే 198వ జయంతిని పురస్కరించుకొని గురువారం ఆదిలాబాద్ లోని ఆ మహనీయుని విగ్రహానికి పలువురు
నివాళులర్పించారు. సంఘం అడహక్ కమిటీ కన్వీనర్ సింగరి అశోక్, సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు బేర దేవన్న, నాయకులు మేకల మల్లన్న, దాసరి బాబన్న, స్వామి, శంకర్, పొచ్చన్న, పాశం రాఘవేంద్ర తదితరులు పాల్గొన్నారు.