ఇద్దరి మహిళలకు ఏడాది జైలు శిక్ష

80చూసినవారు
ఇద్దరి మహిళలకు ఏడాది జైలు శిక్ష
గుడుంబా అమ్ముతూ పట్టుబడిన ఇద్దరి మహిళలకు ఏడాది పాటు జైలు శిక్ష విధించడంతో నిందితులను సోమవారం జిల్లా జైలుకు తరలించినట్లు ఇచ్చోడ ఎక్సైజ్ సీఐ జుల్ఫెకర్ అహ్మద్ తెలిపారు. గుడిహత్నూర్ మండలానికి చెందిన జాదవ్ విమల, భక్వాడ్ లక్ష్మి లు గుడుంబా అమ్ముతూ పలుమార్లు పట్టుబడ్డారు. వారిని మండల తహసీల్దార్ ఎదుట ప్రవేశపెట్టగా బైండోవర్ విధించారు. అయినప్పటికీ మళ్ళీ గుడుంబా అమ్ముతూ పట్టుకోగా, ఈ ఇద్దరికీ ఒక్క సంవత్సరం జైలు శిక్ష విధించారు.

ట్యాగ్స్ :