దూరదర్శన్‌ కిసాన్‌లో ఏఐ యాంకర్లు

79చూసినవారు
దూరదర్శన్‌ కిసాన్‌లో ఏఐ యాంకర్లు
రైతుల కోసం ప్రారంభించిన ప్రత్యేక ఛానల్‌ డీడీ కిసాన్‌ మే 26తో తొమ్మిదేళ్లు పూర్తి చేసుకోనుంది. ఈ సందర్భంగా దూరదర్శన్‌ కీలక నిర్ణయం తీసుకుంది. కృత్రిమ మేధకాలం నడుస్తున్న తరుణంలో ఏఐ యాంకర్లను ప్రవేశపెట్టనున్నట్లు తెలిపింది. ఏఐ క్రిష్‌, ఏఐ భూమి పేరిట వీటిని తీసుకురానున్నట్లు తెలిపింది. దేశంలో ఏఐ యాంకర్లు ఉన్న తొలి ప్రభుత్వ టీవీ ఛానల్‌గా నిలవనుంది. వీటి ద్వారా రైతులకు 50 భాషల్లో సమాచారాన్ని అందిస్తారు.

సంబంధిత పోస్ట్