అదానీ గ్రూప్ స్టాక్స్ మరోసారి నష్టాల్లో కొట్టుమిట్టాడుతున్నాయి. లంచం ఆరోపణల విషయంలో ఆ గ్రూప్పై అమెరికా ప్రభుత్వం దర్యాప్తు చేపట్టిందన్న వార్తల నేపథ్యంలో వాటి విలువ కుంగింది. ఈ గ్రూప్లో ప్రధాన కంపెనీ అయిన అదానీ ఎంటర్ప్రైజెస్ ఉదయం 4 శాతం నష్టపోగా, ప్రస్తుతం కోలుకొని 1 శాతానికి పరిమితమైంది. అదానీ పోర్ట్స్ అండ్ ఎనకమిక్ జోన్ లిమిటెడ్ ఓ దశలో 3 శాతం మేర కుంగగా, ప్రస్తుతం 2 శాతం నష్టంతో ట్రేడవుతోంది.