ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ వంటి సోషల్ మీడియా ప్లాట్పార్మ్లను నిర్వహిస్తున్న మెటా సంస్థపై ఆ సంస్థ మాజీ ఉద్యోగి లొట్టె రుబీక్ అనే సైకాలజిస్ట్ సంచలన ఆరోపణలు చేశారు. మెటా సంస్థ యూజర్ల శ్రేయస్సు కంటే ఆదాయానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోందని ఆమె పేర్కొన్నారు. ఆత్మహత్యలను ప్రేరేపించేలా ఇన్స్టాగ్రామ్లో ఉన్న హానికర కంటెంట్ను తొలగించాలని తాను చేసిన సూచనను పట్టించుకోలేదని చెప్పారు.