ఇటీవల కాంగ్రెస్ను వీడిన సీనియర్ నేతలను ఉద్దేశించి ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై మాజీ సీఎం అశోక్ చవాన్ స్పందించారు. ’’భారత్ జోడో న్యాయ్ యాత్ర ముగింపు కార్యక్రమంలో రాహుల్ నా గురించే మాట్లాడారు. అయితే ఆ మాటలు నిరాధారమైనవి. నేను రాజీనామా చేసేవరకు ఆ విషయం ఎవరికీ తేలీదు. నేను సోనియాగాంధీతో మాట్లాడి, కన్నీరు పెట్టుకున్నానన్నది నిరాధారమైన వ్యాఖ్య. ఎన్నికలను దృష్టిలోపెట్టుకొని ఈ ప్రకటనలు చేశారు’’ అని చవాన్ అన్నారు.