యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనర్సింహ్మా స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఉత్సవాల్లో భాగంగా ఎనిమిదో రోజైన ఇవాళ.. స్వామివారు శ్రీరామ అలంకారంలో హనుమంత వాహన సేవపై భక్తులకు దర్శనమిచ్చారు. ఇవాళ రాత్రి స్వామివారికి తిరు కల్యాణ మహోత్సవం నిర్వహించనున్నారు. కాగా, యాదాద్రిలో ఇవాళ భక్తుల రద్దీ సాధారణంగా కొనసాగుతుంది.