మాజీ సీఎంపై ఓ స్వతంత్య్ర అభ్యర్థి గెలిచి సంచలనం సృష్టించారు. జమ్ముకాశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా బరాముల్లా లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. ఆయనపై స్వతంత్ర అభ్యర్థి షేక్ అబ్దుల్ రషీద్ 2 లక్షల మెజార్టీతో గెలిచారు. అయితే, అబ్దుల్ రషీద్ ను ఉగ్రవాదులకు నిధులు సమకూర్చుతున్నారనే ఆరోపణలతో 2019లో ఎన్ఐఏ అరెస్టు చేయడం గమనార్హం.