వందలాది మంది ప్రాణాలను బలిగొన్న ‘బ్లూవేల్ ఛాలెంజ్’ తరహాలోనే మరో కొత్త గేమ్ రావడం ఆందోళన కలిగిస్తోంది. దాని పేరు ‘మోమో ఛాలెంజ్’. ఈ గేమ్ బారిన పడి ఇప్పటికే ఒకరిద్దరూ మృత్యువాతపడటం మరింత భయం రేకెత్తిస్తోంది. యూకే, మెక్సికో, అర్జెంటీనా, అమెరికా, ఫ్రాన్స్, జర్మనీ దేశాల్లో ఈ గేమ్ విస్తృతమవుతోంది. ప్రత్యేక లింక్ల ద్వారా వేగంగా వ్యాపిస్తున్న మోమో ఛాలెంజ్ భారత్లోనూ అడుగుపెట్టినట్లు అనుమానిస్తున్నారు.