ఇటీవల దుబాయ్లో కురుస్తున్న భారీ వర్షాలు కొత్త చర్చకు తెర లేపాయి. వరద విలయంతో అతలాకుతలంగా మారిన ఎడారి దేశం యుఎఇని చూసి అందరూ షాక్ అయ్యారు. దుబాయ్ వరదలకు సంబంధించిన మరో వీడియో వైరల్ అవుతోంది. ఈ వైరల్ వీడియోలో పారిశ్రామికవేత్త ఆకాష్ మెహతా, దుబాయ్లో ఆకస్మిక వరదల సమయంలో అతను తన బాల్కనీలో నీటిని తోడిపోస్తూ శుభ్రం చేస్తున్నాడు. అయితే, జూమ్ మీటింగ్స్లో పాల్గొంటూనే ఇదంతా చేశాడన్నది ఇక్కడ ఆసక్తికరమైన విషయం.