'కర్మలను నశింపజేసుకుంటే ఎవరైనా దేవుడు కావచ్చు. ఊహాత్మకమైన దేవుణ్ణి వెతకడానికి బదులు, మీరే దైవత్వాన్ని పొందడానికి ప్రయత్నించండి' అంటూ మానవాళికి మార్గనిర్దేశనం చేసిన మహనీయుడు వర్ధమాన మహావీరుడు. 'సరైన విశ్వాసం, సరైన జ్ఞానం, సరైన నడవడిక' అనే త్రిరత్నాలను పాటించడమే మోక్షాన్ని పొందే మార్గమని బోధించిన మహావీరుడి జయంతి నేడు.