చంద్రబాబు అధికారంలోకి వస్తే రాక్షస రాజ్యం వస్తుందని వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం అన్నారు. 2016లో రాక్షస రాజ్యం చూశానని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాకినాడలో ఆదివారం ముద్రగడ మీడియాతో మాట్లాడుతూ.. ‘నాలుగేళ్ల పాటు చంద్రబాబు రావణ రాజ్యం అనుభవించాం. కిర్లంపూడిని పాకిస్తాన్ చేశాడు. ఈ విషయంలో చంద్రబాబును అస్సలు వదిలిపెట్టను. చంద్రబాబు కడుపులో అధికార ఆకలి దహించిపోతుంది. అధికారంలోకి వచ్చాక రాష్ట్రాన్ని రావణకాష్టం చేస్తాడు.’ అని అన్నారు.