కుటుంబ కలహాలతో భార్యను భర్త అతికిరాతకంగా నరికి చంపిన ఘటన కాకినాడలోని జగన్నాథపురం పప్పుల మిల్లు ప్రాంతంలో జరిగింది. వివరాల ప్రకారం.. నూకరాజు అనే వ్యక్తికి 2016లో దివ్యతో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు సంతానం. గురువారం బయటికి వెళ్లివచ్చిన నూకరాజు.. భార్య దివ్యతో గొడవపడ్డాడు. ఈ క్రమంలో ఇంట్లో ఉన్న కత్తి తీసుకొని ఆమెను విచక్షణా రహితంగా నరికి చంపాడు. అనంతరం స్థానిక పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు.