రైతులకు పెట్టుబడి సాయం అందించేందుకు ఉద్దేశించిన ‘పీఎం-కిసాన్ సమ్మాన్నిధి’ పథకం 17వ విడత నిధులను ప్రధాని మోదీ మంగళవారం విడుదల చేశారు. దాదాపు 9.26 కోట్ల మంది రైతుల ఖాతాల్లో రూ.2వేలు చొప్పున రూ.20 వేల కోట్లు జమ అవుతాయి. https://pmkisan.gov.in/BeneficiaryStatus_New.aspx లింక్పై క్లిక్ చేసి మీ రిజిస్ట్రేషన్ నంబర్, క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి మీ ఖాతాలో డబ్బులు పడ్డాయో లేదో తెలుసుకోవచ్చు.