ఉప్పును అధికంగా తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని నిపుణులు చెబుతున్నారు. ఉప్పును అధికంగా తీసుకోవడం వల్ల గుండెపోటు, స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతుంది. మూత్రపిండాల వ్యాధులకు దారితీస్తుంది. అలాగే బీపీతో పాటు మధుమేహం వచ్చే ప్రమాదం ఉంది. అధిక దాహం వంటి సమస్యలు ఎదురవుతాయి. జీర్ణాశయ క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. దీంతో రోజుకు 5 గ్రాముల కంటే ఎక్కువ ఉప్పు తీసుకోకూడదని సూచిస్తున్నారు.