మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలింది. లోక్సభ మాజీ స్పీకర్ శివరాజ్ పాటిల్ కోడలు అర్చన పాటిల్ చకుర్కర్ ఇవాళ బీజేపీలో చేరారు. అర్చన పాటిల్ ఉద్గీర్లోని లైఫ్కేర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్ చైర్పర్సన్ గా ఉన్నారు. ఆమె భర్త శైలేష్ పాటిల్ చందూర్కర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నారు. కాంగ్రెస్ నేతృత్వంలోని శివరాజ్ పాటిల్ 2004 మరియు 2008 మధ్య కేంద్ర హోంమంత్రిగా ఉన్నారు.