జేఈఈ మెయిన్ రెండో సెషన్ పరీక్షకు సంబంధించిన అడ్మిట్ కార్డులు ఏప్రిల్ 1న నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) విడుదల చేయనుంది. జేఈఈ మెయిన్ సెషన్-2 పరీక్షలు వచ్చే నెల 4 నుంచి ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 15 వరకు రోజూ రెండు సెషన్లలో దేశవ్యాప్తంగా 319 పట్టణాల్లో ఎగ్జామ్ను నిర్వహిస్తారు. అదే నెల 25న ఫలితాలు వెలువడనున్నాయి. కాగా, జేఈఈ మెయిన్ సెషన్-1 గత జనవరిలో ముగిసిన విషయం తెలిసిందే.