పిఠాపురం చేరుకున్న జనసేన అధినేత పవన్

64చూసినవారు
పిఠాపురం చేరుకున్న జనసేన అధినేత పవన్
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం చేరుకున్నారు. గొల్లప్రోలులో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్ వద్దకు శనివారం మధ్యాహ్నం చేరుకున్నారు. ఆయనకు పార్టీ నేతలు బొకేలు ఇచ్చి ఘన స్వాగతం పలికారు. దొంతమూరు గ్రామంలోని పిఠాపురం టీడీపీ ఇంఛార్జ్, మాజీ శాసనసభ్యులు వర్మ నివాసానికి వెళ్లి ఆయనతో మర్యాదపూర్వకంగా భేటీ కానున్నారు. సాయంత్రం 4 గంటలకు చేబ్రోలు, రామాలయం సెంటర్ వద్ద ఏర్పాటు చేసిన ’వారాహి విజయభేరీ‘ సభలో పాల్గొంటారు.

సంబంధిత పోస్ట్