ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో సీఎం కేజ్రీవాల్ను సీబీఐ మంగళవారం రాత్రి తీహార్ జైలులో అరెస్ట్ చేసింది. రౌస్ అవెన్యూ కోర్టులో బుధవారం ఆయనను ప్రవేశపెట్టింది. కేజ్రీవాల్ను తమ కస్టడీకి ఇవ్వాలని సీబీఐ కోరుతోంది. ప్రత్యేక న్యాయమూర్తి అమితాబ్ రావత్ ఈ కేసు విచారించనున్నారు. ఇదే కోర్టులో ఇటీవల కేజ్రీవాల్కు న్యాయమూర్తి నియాయ్ బింద్ కేజ్రీవాల్కు బెయిల్ మంజూరు చేయగా, దానిపై ఢిల్లీ హైకోర్టు స్టే విధించింది.