దారుణం: కొండచిలువను బైక్ కు కట్టి ఈడ్చుకెళ్లారు(వీడియో)

72చూసినవారు
రాజస్థాన్ లో బాన్స్ వారాలో ఇటీవల దారుణ ఘటన చోటు చేసుకుంది. అటవీ ప్రాంతం నుంచి ఊర్లోకి వచ్చిన ఓ కొండచిలువను కొంతమంది వ్యక్తులు బంధించి బైకుకు కట్టి అది చనిపోయేవరకూ రోడ్డుపై ఈడుస్తూ తిప్పారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఊళ్లోకి వస్తే మనుషులకు దూరంగా వదిలేయాలి తప్ప ఇలా చిత్రహింసలు పెట్టి చంపడమేంటంటూ విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నిందితులపై కేసు నమోదు చేయనున్నట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు.

సంబంధిత పోస్ట్