TG: చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధానార్చకుడు రంగరాజన్పై దాడి కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. ప్రధాన నిందితుడు వీరరాఘవరెడ్డిని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. నేటితో అతడి కస్టడీ ముగియనుంది. శుక్రవారం నిందితుడిని కోర్టులో హాజరుపరచనున్నారు. కస్టడీ విచారణలో చేసిన నేరాన్ని వీరరాఘవరెడ్డి అంగీకరించారు. దీంతో నేరాంగీకార వాంగ్మూలాన్ని పోలీసులు రికార్డు చేశారు.