రాహుల్ గాంధీకి బెంగళూరు కోర్టు నోటీసులు

80చూసినవారు
రాహుల్ గాంధీకి బెంగళూరు కోర్టు నోటీసులు
పరువునష్టం కేసులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి బెంగళూరు కోర్టు నోటీసులు జారీ చేసింది. ఈనెల 7న కోర్టుకు వ్యక్తిగతంగా హాజరుకావాలని ఆదేశించింది. ఈ కేసుపై శనివారం విచారణ జరగగా.. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌కు బెయిల్ మంజూరు చేసింది. కాగా, గత బీజేపీ ప్రభుత్వం అన్ని పనుల్లో 40% కమీషన్ వసూలు చేసిందని కాంగ్రెస్ ఆరోపించడంపై బీజేపీ పరువునష్టం దావా వేసింది.