ఈ 5 రోజులు జాగ్రత్త

73చూసినవారు
ఈ 5 రోజులు జాగ్రత్త
తెలుగు రాష్ట్రాల్లో భానుడి సెగ పెరుగుతోంది. తెలంగాణలో నేటి నుంచి 5 రోజుల పాటు ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతాయని వాతావరణశాఖ తెలిపింది. ఈ క్రమంలో 7 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే ఏపీలో రాబోయే రెండు, మూడు రోజులు వడగాలుల తీవ్రత పెరిగే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. నిన్న తెలంగాణలోని నిర్మల్ జిల్లా దస్తూరాబాద్‌లో అత్యధికంగా 43.1, ఏపీలోని నంద్యాలలో 42 డిగ్రీల టెంపరేచర్ నమోదైంది.

సంబంధిత పోస్ట్