లోయలో పడిన బస్సు.. 45 మంది మృతి

597చూసినవారు
లోయలో పడిన బస్సు.. 45 మంది మృతి
దక్షిణాఫ్రికాలో ఘోర ప్రమాదం జరిగింది. బోట్స్‌వానా నుంచి మోరియా వెళ్తున్న బస్సు వంతెనపై నుంచి అదుపు తప్పి లోయలో పండింది. ఈ ఘటనలో 45 మంది మృతిచెందగా, 8 ఏళ్ల బాలిక ప్రాణాలతో బయటపడింది. ఈస్టర్ పండుగ కోసం జియాన్ చర్చికి వెళుతుండగా ప్రమాదం చోటు చేసుకుంది. 165 అడుగుల లోతులో బస్సు పడటంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో కొన్ని మృతదేహాలు గుర్తించలేనంతగా కాలిపోయినట్లు అక్కడి అధికారులు తెలిపారు.

సంబంధిత పోస్ట్