సీఎం జగన్ చేపట్టిన 'మేమంతా సిద్ధం' బస్సు యాత్ర నేడు కర్నూలు జిల్లా పెంచికలపాడు నుంచి ప్రారంభంకానుంది. ఉదయం 9 గంటలకు జగన్.. పెంచికలపాడు నుంచి రామచంద్రపురం, కోడుమూరు, హంద్రీ కైరవడి, గోనెగండ్ల మీదుగా రాళ్లదొడ్డి చేరుకుంటారు. అక్కడ భోజన విరామం తీసుకుని అనంతరం కడిమెట్ల మీదుగా ఎమ్మిగనూరులోని వీవర్స్ కాలనీ సొసైటీ గ్రౌండ్ లో నిర్వహిస్తున్న బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు.