ట్రాక్టర్​ ని ఢీకొట్టిన బైకర్.. ఇద్దరు యువకులు స్పాట్‌డెడ్ (వీడియో)

65చూసినవారు
ఏపీలోని చిత్తూరు జిల్లాలో ఘెర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ట్రాక్టర్​ను బైక్ ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు పాలిటెక్నిక్ విద్యార్థులు మరణించారు. మరొకరు గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మృతులను ఆనందబాబు (17), మంజు (17) చనిపోగా, పునీత్​ అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. వీరు ముగ్గురు కుప్పం ప్రభుత్వ పాలిటెక్నిక్​ కళాశాలలో చదువుతున్నారు. ద్విచక్ర వాహనాన్ని అతివేగంగా నడపడం వల్లే ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్