గుండెపోటుతో బీజేపీ లోక్‌సభ అభ్యర్థి కన్నుమూత

69చూసినవారు
గుండెపోటుతో బీజేపీ లోక్‌సభ అభ్యర్థి  కన్నుమూత
ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్‌కు చెందిన బీజేపీ లోక్‌సభ అభ్యర్థి కున్వర్ సర్వేష్ సింగ్ ( 71) ఇవాళ కన్నుమూశారు. కున్వర్ సర్వేష్ సింగ్‌కు గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్న ఆయన ఇవాళ సాయంత్రం 6.30 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల పలువురు బీజేపీ నేతలు సంతాపం తెలిపారు. శుక్రవారం లోక్‌సభ ఎన్నికల తొలి విడతలో మొరాదాబాద్ స్థానానికి పోలింగ్ జరిగిన విషయం తెలిసిందే.