గిరిజనుల్లో నెలకొన్న నిరాశ నిస్పృహలను తొలగించడానికి అప్పటి ప్రభుత్వం 1987లో ప్రభుత్వ నిధులతో స్మారక స్తూపాన్ని నిర్మించింది. అయితే స్తూపం వద్దకు గిరిజనులను అనుమతించడానికి మాత్రం పోలీసులు నిరాకరిస్తున్నారు. గత ప్రభుత్వాల హయాంలో ఏప్రిల్ 18-20 మూడు రోజులపాటు ఉట్నూర్ రహదారిని దిగ్భంధించేవారు. ఈ సారి మాత్రం అలాంటి ఆంక్షలు విధించకుండా పోలీసులు స్తూపం పరిసర ప్రాంతాల్లో మాత్రమే 144 సెక్షన్ విధించారు.