1981, ఏప్రిల్ 20న భూమి కోసం.. భుక్తి కోసం.. విముక్తి కోసం.. మా ఊళ్లో మా రాజ్యం అనే నినాదంతో రైతు కూలీ ఉద్యమకారులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. దీంతో పోలీసు బలగాలు ఉద్యమకారులపై తుపాకీ గుండ్ల వర్షం కురిపించాయి. ఈ ఘటనలో ఎందరో గిరిజనులు అమరులయ్యారు. అప్పటి నుంచి ప్రతి ఏటా ఏప్రిల్ 20న ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలో నిర్మించిన అమరుల స్థూపం వద్ద అమరవీరులకు ఘన నివాళులర్పించడం ఆనవాయితీగా వస్తోంది.