అసెంబ్లీ స్పీకర్‌కు రాజీనామా లేఖ ఇచ్చిన బీజేపీ ఎంపీ (Video)

57చూసినవారు
ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌ నుంచి ఎంపీగా గెలిచిన బ్రిజ్‌మోహన్‌ అగర్వాల్‌.. తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. రాయ్‌పూర్‌లోని ఛత్తీస్‌గఢ్‌ అసెంబ్లీ స్పీకర్‌ రమణ్‌సింగ్‌ నివాసానికి వెళ్లి రాజీనామా లేఖను సమర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గత 35 ఏళ్లుగా తాను మధ్యప్రదేశ్‌ అసెంబ్లీకి, ఛత్తీస్‌గఢ్‌ అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తూ వచ్చానని చెప్పారు. ఇది నాకు ఎంతో భావోద్వేగపూరితమైన సందర్భమని పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్