AP: పల్నాడు జిల్లా గురజాల కారంపూడి రోడ్ దగ్గర షాకింగ్ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. యాక్సిస్ బ్యాంక్ సమీపంలోని ఓ బావిలో గుర్తు తెలియని మహిళ మృతదేహం లభించింది. స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.