బాలుడిని ఢీకొట్టిన పికప్ ట్రక్కు.. ఆసుపత్రికి తీసుకెళ్తుండగా మృతి (వీడియో)

69చూసినవారు
యూపీలోని సిద్ధార్థ్ నగర్‌లో ఈ నెల 18న షాకింగ్ ఘటన జరిగింది. ఓ బాలుడు స్కూల్ బస్సు నుంచి దిగి రోడ్డు దాటాడు. ఆ సమయంలో ఓ పికప్ ట్రక్కు వేగంగా దూసుకొచ్చింది. రోడ్డు దాటుతున్న బాలుడిని ఆ పికప్ ట్రక్కు ఢీకొట్టింది. తీవ్ర గాయాలపాలైన బాలుడిని స్థానికులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆ బాలుడు చనిపోయినట్లు వైద్యులు వెల్లడించారు. ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్