BREAKING: కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌కి అస్వస్థత

8004చూసినవారు
BREAKING: కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌కి అస్వస్థత
కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ అస్వస్థతకు గురయ్యారు. ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) న్యూరో సర్జరీ విభాగంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చేరారు. ఆయన వెన్ను నొప్పితో బాధపడుతున్నట్లు సమాచారం. న్యూరో సర్జన్ డాక్టర్ అమోల్ రహేజా పర్యవేక్షణలో ఆయనకు చికిత్స జరుగుతోంది. ప్రస్తుతం ఆస్పత్రి నుంచి ఎలాంటి ప్రకటన వెలువడలేదు.

సంబంధిత పోస్ట్