భారత దేశంలో ఇప్పటివరకు రైతులకు సంబంధించిన రూ .2 లక్షల రుణాలను ఏకకాలంలో రద్దు చేసిన దాఖలాలు ఎక్కడా లేవని, ధనిక రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం కనీసం రూ. 1 లక్ష రుణ మాఫీనీ కూడా చేయలేక పోయిందని ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ విమర్శించారు. లోటు బడ్జెట్ ఉన్నా కూడా నిధులను పోగుచేసి రూ. 31 వేల కోట్లతో రైతు రుణమాఫీని విజయవంతంగా పూర్తిచేస్తోందని లక్ష్మణ్ అన్నారు.