బీహార్లోని ముజఫర్పూర్లో డిసెంబర్ 27న దారుణ హత్య జరిగింది. రాంబాగ్ చౌక్లో అఫ్రోజ్ ఖత్రీ అనే వ్యక్తి మటన్ దుకాణం నిర్వహిస్తున్నాడు. ఆయన తన దుకాణానికి వెళ్తుండగా బైక్పై వచ్చిన దుండగులు తుపాకీతో తలపై కాల్చారు. దీంతో అఫ్రోజ్ ఖత్రీ సంఘటనా స్థలంలోనే చనిపోయాడు. ఈ కేసులో నిందితులను పోలీసులు ఇంకా గుర్తించలేదు. హత్యకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.